AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యం సహా అన్ని అత్యవసర సేవలు ఇకపై 112 టోల్ఫ్రీ నంబర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వం 108 (అంబులెన్స్), 102 (తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్), 104 (మొబైల్ హెల్త్)తో పాటు పోలీస్, ఫైర్ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురానుంది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం రావత్’ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏకీకరణ జరుగుతుంది. అమెరికాలోని 911 నంబర్ తరహాలోనే ఇక్కడ 112 పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ఈ మార్పుతో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సేవలు పొందడం సులభతరం అవుతుంది.