ఉపాధి హామీ కూలీలకు అలర్ట్.. ఇలా చేయకపోతే డబ్బులు రావు!

AP: ఉపాధి హామీ పథకంలో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఉపాధి హామీ కూలీలకు ఫేషియల్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. మార్చి 2 నుంచి ఈ విధానం కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు  ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ నూతన విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది.  ఈ నిబంధనను ఫాలొ కాకుంటే అకౌంట్లోకి ఉపాధి కూలీ డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్