అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీలోని హుకుంపేట మండలంలో జిల్లా కలెక్టర్ నిశాంతి శనివారం ఉదయం సంతలో నిత్యావసర వస్తువుల నాణ్యతను, ధరలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు విక్రయిస్తున్న సరుకుల గడువు తేదీలను పరిశీలించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆకస్మిక తనిఖీలో సంబంధిత మండల స్థాయి అధికారులు కలెక్టర్తో ఉన్నారు.