విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాస్ శుక్రవారం రామకృష్ణ బీచ్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. బీచ్ను పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చర్యకు స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. స్వయంగా క్లీనింగ్ వెహికల్ నడిపి చెత్తను తరలించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు.