దక్షిణ కోస్తా రైల్వే తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన సందీప్ మాధుర్ శనివారం విశాఖపట్నం చేరుకున్నారు. వాల్తేర్ డీఆర్ఎం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. త్వరలోనే జోన్కు చెందిన మిగతా డివిజన్లను సందర్శించనున్నారు. ఆయన రాకతో దక్షిణ కోస్తా రైల్వే కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.