నర్సీపట్నంలో గ్యాస్ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గ్యాస్ బుక్ చేసినా ఓటీపీ రాకపోయినా, లేదా ఓటీపీలో ఏవైనా సమస్యలు తలెత్తినా 9032906224 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తహశీల్దార్ లోకవరపు రామారావు సూచించారు. ఈ కంట్రోల్ రూమ్లో జూనియర్ అసిస్టెంట్ రాజు అందుబాటులో ఉంటారని తెలిపారు.