గుత్తి కోటలోని 12వ వార్డులో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఐ.ఏ.ఎస్. సెన్సెస్ కార్యక్రమాన్ని పరిశీలించారు. స్వీయ గణన పూర్తయిన తర్వాత, గత మూడు రోజులుగా సిబ్బంది సెన్సెస్ బ్లాక్ బౌండరీలను గుర్తించి, కేటాయించిన ప్రాంతాల్లోని ఇళ్లను లెక్కించారని కలెక్టర్ తెలిపారు. ఈ సెన్సెస్ ప్రక్రియకు ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.