సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు, జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలు, మండలాల్లో శక్తి టీం సభ్యులు మహిళలు, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా, ఇలాంటి ఘటనలను అడ్డుకోవడానికి ప్రజలు ఎలా ముందుకు రావాలో వివరించారు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే ఫోన్ నెంబర్లను కూడా తెలియపరిచారు.