AP: ఈఏపీసెట్ ఫలితాలను మంగళవారం విడుదల చేయడానికి విద్యా శాఖ సిద్ధమైంది. ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సీబీఎస్ఈ రీవాల్యూయేషన్ రెండో విడత ఫలితాలను పక్కనపెట్టి ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీని వలన కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగేలా విద్యాశాఖ చర్యలు కనిపిస్తున్నాయి.