‘స్పేస్ పాలసీ’ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లపాటు అమలులో ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. దీని అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అంతరిక్ష ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులకు ఈ కార్పొరేషన్ సాయం చేస్తుందని వెల్లడించింది. మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలని కార్పొరేషన్‌కు నిర్దేశించింది. సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్