ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 తుది ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 81 పోస్టులకు గతేడాది జూన్ 23 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడం, న్యాయస్థానం ఆదేశాలకు లోబడి ఫలితాలు విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ తుది జాబితాను విడుదల చేసింది.