ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ‘స్వయం’ అనే పేరుతో ప్రత్యేక బ్రాండ్ను తీసుకురావాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఉత్పత్తులకు ఆకర్షణీయమైన బ్రాండింగ్, లోగోతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్కెటింగ్ కల్పించాలని ఆదేశించారు. లోగో ఎంపికలో డ్వాక్రా సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పించడం ప్రభుత్వ బాధ్యతేనని సీఎం స్పష్టం చేశారు.