విజయవాడలో లూలు మాల్కు భూముల కేటాయింపుపై చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ కేటాయింపును సవాలు చేస్తూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. లూలు మాల్కు కేటాయించిన భూమిని రద్దు చేసుకుంటున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపినట్లు సమాచారం. త్వరలోనే రద్దుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.