AP: కృష్ణా, గుంటూరు ప్రాంతాలను పాలించిన రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. 1761 ఏప్రిల్ 27న జన్మించిన ఆయన, 1816 వరకు పాలన సాగించి, ప్రజల కోసం ఖజానాలోని బంగారు నాణేలను వినియోగించి, వేలాది మందికి అన్నదానం చేశారు. ఆయన నిర్మించిన అమరావతి పట్టణాన్ని విదేశీ పర్యాటకులు సైతం కొనియాడారు. శత్రువులను అణచివేసి, 108 దేవాలయాలు నిర్మించిన ఆయన స్ఫూర్తితో ఏపీ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు.