జిల్లా కేంద్రం చిత్తూరులో రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్న పశువుల వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. వాహనాలకు, అంబులెన్స్లకు కూడా ఇవి అడ్డుపడుతున్నాయి. నాయకులు వెళ్లేటప్పుడు మాత్రమే అధికారులు హడావిడి చేస్తారని, మిగతా సమయాల్లో పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పశువుల యజమానులను హెచ్చరించి, రోడ్లపై పశువులు తిరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.