శుక్రవారం జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ ఆర్ పురం బీసీ కాలనీలో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనపై చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం సీఎంసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని ఆయన ప్రకటించారు.