గూడూరు ఏఈగా శ్వేత నియామకం

గూడూరు ఒకటో పట్టణ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ)గా శ్వేత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. పట్టణంలో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా సమన్వయంతో పరిష్కారాలు చేపడతానని శ్వేత తెలిపారు. విద్యుత్ బకాయిలు ఉన్న వినియోగదారులు వెంటనే చెల్లించి సహకరించాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్