మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న భారతదేశ జనగణనలో ప్రజలు పూర్తిగా సహకరించాలని పుత్తూరు మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు గురువారం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం కోసం పుత్తూరు పురపాలక కార్యాలయ సిబ్బందిని ఏన్యుమరేటర్లు, సూపర్ వైజర్స్గా నియమించినట్లు ఆయన తెలిపారు. పుత్తూరు పట్టణ పరిధిలోని ప్రజలు జనగణన సిబ్బందికి సహకరించాలని అధికారి కోరారు.