సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలం చిలమత్తూరు కమ్మ వీధిలో నెలకొన్న తాగునీటి సమస్యను ఎంపీడీవో విజయమ్మ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకున్న ఆమె, సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.