రేణిగుంట నుంచి వాహనాల మళ్లింపు

ఒంటిమిట్టలో శ్రీరామ నవమి సందర్భంగా రాములవారి కళ్యాణం నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో, పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం వరకు భారీ వాహనాలను దారి మళ్లించారు. రేణిగుంట నుంచి కడప వైపు వెళ్లే భారీ వాహనాలు భాకరాపేట, పీలేరు, రాయచోటి మీదుగా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా సహకరించాలని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు కోరారు.

సంబంధిత పోస్ట్