సూళ్లూరుపేట తడ మండలంలోని పెట్రోల్ బంకులను ఆర్ వనజ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను యాజమాన్యాలకు వివరించారు. ముఖ్యంగా రేషనలైజ్ సిస్టము కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వీఆర్వోలు జ్ఞానయ్య, బాబు, హైమావతి, వీఆర్ఎ చెంచు కృష్ణ తదితరులు పాల్గొని బంకుల్లో ఇంధన నిల్వలను పరిశీలించారు.