వెంకటగిరి సీఐ ఏవీ రమణ మంగళవారం వెంకటగిరి మండల అధికారులతో కలిసి కైవల్యా నదిని పరిశీలించారు. లో లెవల్ వాటర్ ఏరియా కావడంతో భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాజ్వేలు లేదా వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.