AP: కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు మంగళగిరి APSP ఆరోబెటాలియన్లో మంగళవారం సాయంత్రం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని, అభ్యర్థులతో ముచ్చటిస్తారు. ఈ నెల 22 నుంచి 9 నెలల పాటు వారికి శిక్షణ ప్రారంభం కానుంది. కాగా, 2022 నవంబర్లో 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.