AP: రాయచోటి పర్యటనలో సీఎం చంద్రబాబును ఓ ఐటీ ఉద్యోగి ఆశ్చర్యపోయేలా చేశాడు. యువరాజ్ అనే వ్యక్తి తాను బెంగళూరుకు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పరిచయం చేసుకుని.. 'ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాను. నెలకు కటింగ్స్ పోను రూ.6.37 లక్షల జీతం పడుతుంది. మొత్తం ఏడాదికి రూ.93 లక్షలు' అని చెప్పాడు. దీంతో ఇంటి దగ్గర కూర్చొని అంత సంపాదిస్తున్నాడంటూ సీఎం సైతం ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.