AP: అమరావతిలో సీఆర్డీఏ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన విజయరామరాజు మంత్రి నారాయణతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం సీఆర్డీఏ ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు ఏజీఐసీఎల్ ఎండీ శ్రీనివాస్ హాజరై కీలక అంశాలపై చర్చించారు.