కోనసీమ: 'యుద్ధప్రాతిపదికన హైవే విద్యుత్ పనులు పూర్తి చేయండి'

అమలాపురంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పాసర్లపూడి, దిండి జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ లైన్లను త్వరితగతిన తొలగించాలని ఆదేశించారు. రెవెన్యూ, ట్రాన్స్‌కో, ఎన్‌హెచ్ అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొత్త లైన్ల ఏర్పాటుపై ఈనెల 10 లోపు తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు మంగళవారం సూచించారు.

సంబంధిత పోస్ట్