రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల సమన్వయం అవసరం

రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల సమన్వయం అత్యవసరమని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. బుధవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పోలీస్, ఎన్‌హెచ్ఏఐ అధికారులతో కలిసి NH-16, NH-216A జాతీయ రహదారులను ఆయన సంయుక్తంగా తనిఖీ చేశారు. ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద తక్షణమే సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్