అంబాజీపేట పాఠశాల ఘటనపై బాలల హక్కుల కమిషన్ సీరియస్

మంగళవారం, అంబాజీపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థి మణికంఠ గాయపడిన ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు డా. నాగ మానస విచారణ చేపట్టారు. బాలలతో పనులు చేయించడం చట్టవిరుద్ధమని, పాఠశాలలో భద్రత, పరిశుభ్రత లోపించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తక్షణమే వసతులు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్