మామిడికుదురు మండలం అప్పనపల్లి వద్ద ప్రతిపాదిత కాజ్వే నిర్మాణానికి పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పి. గన్నవరం నియోజకవర్గ కూటమి నాయకులు శంకుస్థాపన స్థలాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కాజ్వే పూర్తయితే స్థానిక ప్రజల రవాణా ఇబ్బందులు తొలగుతాయని నాయకులు తెలిపారు. కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.