దేవరపల్లి మండలం ధూమంతునిగూడెం గ్రామంలోని పాత సచివాలయం, MPUP పాఠశాల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు సిబ్బందికి, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ మొక్కలు దోమలు, పాములకు ఆవాసంగా మారడంతో ఆరోగ్య సమస్యలు, భయాందోళనలు నెలకొన్నాయి. స్థానిక నాయకులు ఈ సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను పరిశుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.