గోపాలపురం నియోజకవర్గంలోని పోతవరం నుంచి జి. కొత్తపల్లి వరకు రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ & బీటీ రోడ్డు నిర్మాణ పనులు మంగళవారం శరవేగంగా జరుగుతున్నాయి. పోతినీడు పాలెం సర్పంచ్ పిచ్చుకల గణపతి, చాదరాశి కుంట సర్పంచ్ నాయుడు శ్రీనివాసరావు తదితరులు ఈ పనులను పరిశీలించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక చొరవతో ఈ రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు వారు తెలిపారు.