కొత్తపేట ఏఎంసీ డైరెక్టర్గా నియమితులైన దుర్గా భవానిని మంగళవారం ఆమె స్వగృహమైన ర్యాలిలో గౌడ సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. ఆమెను పూలమాలలు, దుశ్శాలువతో సన్మానించి, కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంకర రామకృష్ణ గౌడ, మండపేట బీసీ సంఘం కార్యదర్శి తీగిరెడ్డి మహేష్ గౌడ, మార్గాన్ని శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.