రాజమండ్రి నగరంలో అన్నా క్యాంటీన్లను సమర్థవంతంగా నిర్వహించాలని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. మంగళవారం శేషయ్యమెట్టలోని క్యాంటీన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం సకాలంలో అందించాలని సూచించారు. క్యాంటీన్ల నిర్వహణపై నోడల్ అధికారుల నిరంతర పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు.