ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పీజీఆర్ఎస్ ద్వారా పరిష్కరిస్తున్నామని రాజమండ్రి అడిషనల్ కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్ తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 17 అర్జీలు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్కి 5, రెవెన్యూకి 2, టౌన్ ప్లానింగ్కి 4, సచివాలయాలకు 6 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. పురమిత్ర యాప్పై అవగాహన పెంచాలన్నారు.