పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక)లో నిర్ణీత సమయంలో పరిష్కారం కాని అర్జీలు ప్రజల సంతృప్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో జేసీ వై. మేఘా స్వరూప్తో కలిసి ప్రజల నుంచి 165 అర్జీలను స్వీకరించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని శాఖలు తమ పనితీరులో స్పష్టత, వేగం, బాధ్యత వహించాలని ఆమె సూచించారు.