రాజమండ్రి రూరల్ దవళేశ్వరం లోని అగస్త్యేశ్వర స్వామి ఆలయం వద్ద చెత్త పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. పురాతన ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారు. పంచాయతీ అధికారులు స్పందించి చెత్తను తొలగించి, పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు. ఈ సమస్యపై గురువారం స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేశారు.