రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద మార్చి 30వ తేదీన PGRS & రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. సోమవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల, మున్సిపాలిటీ స్థాయిలలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.