రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గురువారం రాజానగరంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో పుష్కరాల ఏర్పాట్లు, ఘాట్ల అభివృద్ధి, వేసవిలో నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉన్నతాధికారుల అనుమతి కోసం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.