గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించిన నార్త్ జోన్ డీఎస్పీ

గోదావరి పుష్కరాల ఏర్పాట్లను నార్త్ జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన్ బుధవారం పరిశీలించారు. సీతానగరం మండలం ముగ్గుళ్ల, వంగలపూడి ఘాట్లను సందర్శించి భద్రతపై దిశానిర్దేశం చేశారు. చినకొండేపూడిలో జాతర ఏర్పాట్లపై చర్చించారు. సీతానగరం, లంకూరులో 'యూత్ కనెక్ట్' కార్యక్రమంలో యువతకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్