జులై నుంచి అందుబాటులో ఎలక్ట్రిక్ బస్సులు

AP: రాష్ట్రంలోని 11 నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయి. వీటిలో తొలుత 300 బస్సులు జులై ఆఖరు నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఆర్టీసీలో కాలం చెల్లిన డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా మొత్తం 2,500 విద్యుత్ బస్సులు, 500 సీఎన్‌జీ బస్సులు తీసుకునేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రాబోయే రోజుల్లో పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ సర్వీసుల వరకు అన్నింటికీ విద్యుత్ బస్సులే వినియోగించనున్నారు.

సంబంధిత పోస్ట్