భూములు లేని వారికి గుడ్ న్యూస్. నెలకు రూ.5,000?

AP: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో భూములు లేని పేదలకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 4,929 మందికి భూమి లేదని గుర్తించింది. వీరందరికీ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం త్రిసభ్యకమిటీని నియమించింది. అర్హులైన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇచ్చే యోచనలో ఉంది. గ్రామ సభల సమయంలో ఆర్జీలు సమర్పించవచ్చని సీఆర్డీఏ స్పష్టం చేసింది. భూమి లేని పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్