AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదోన్నతుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డిమాండ్ను పరిగణలోకి తీసుకుని పదోన్నతుల కేటాయింపుపై అధ్యయనం చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో కూడా జారీ చేసింది. ఈ కమిటీలో 10 మంది మంత్రిలు సభ్యులుగా ఉంటారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. కమిటీ శరవేగంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తే, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి.