తెనాలి పురపాలక సంఘం వెనుక స్వర్ణకారుల కోసం నిర్మిస్తున్న నూతన భవనం వద్ద పారిశుద్ధ్య పరిస్థితిని ఎమ్మెల్సీ అలపాటి రాజా గురువారం పరిశీలించారు. డయేరియా, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా పురపాలక సంఘం విస్తృత చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. తురకపాలెం గ్రామంలోని సంఘటన దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసిన నేపథ్యంలో తెనాలిలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఆయన అన్నారు.