బాపట్ల మండలం నాగరాజు కాలువపై రూ. 14 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన వంతెన నిర్మాణ పనులను శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ బుధవారం పరిశీలించారు. ముత్తాయపాలెం నుండి కప్పలవారిపాలెం గ్రామాలను కలిపే ఈ వంతెన పనుల నాణ్యతను ఎమ్మెల్యే పరిశీలించి, అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచనలు చేశారు.