చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్ వద్ద బుధవారం ద్విచక్ర వాహనాలపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఎస్సై చెన్నకేశవుల పాల్గొన్నారు. హెల్మెట్ ధరించని వారు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనదారులు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ఈ ప్రత్యేక చేక్పోస్ట్లో భద్రతా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.