బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వేటపాలెం మండలంలో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా, కచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం పొట్టి సుబ్బయ్యపాలెంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించిన ఆయన, 2002 ఓటర్ల జాబితాను 2025 జాబితాతో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. మ్యాపింగ్ ప్రక్రియ మందగించడంపై సంబంధిత బీఎల్వోను కలెక్టర్ నిలదీశారు.