గుంటూరు జీజీహెచ్ కొత్త సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్. వి. సుందరాచారి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తన ప్రధాన లక్ష్యమని, జీజీహెచ్ను అన్ని వర్గాల ప్రజలు నమ్మకంతో వైద్యం పొందే ఆసుపత్రిగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 5 వేల మంది రోగులకు ఇక్కడ సేవలు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.