గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పీఏగా నియమితులైన ట్రాన్స్ఉమెన్ వర్షిణిని మంత్రి లోకేశ్ కలిశారు. కేంద్రమంత్రి పెమ్మసాని నివాసంలో జరిగిన సమావేశంలో వర్షిణిని ఆయనకు ఎమ్మెల్యే పరిచయం చేశారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలనే దానికి ఇది చక్కటి నిదర్శనం. ట్రాన్స్జెండర్లకు గౌరవం, గుర్తింపు ఇచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయం సమాజంలో ఎందరికో ఆదర్శంగా, ప్రేరణగా నిలుస్తోంది.