గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా బదిలీపై గత 10 రోజులుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆమెకు విద్యాశాఖ డైరెక్టర్ పదవి దక్కనున్నట్లు ముందుగానే ప్రచారం జరగడం గమనార్హం. బదిలీ నిలిపివేయాలని కోరుతూ ప్రజాసంఘాలు పీజీఆర్ఎస్లో జేసీ అశుతోష్ మిశ్రాకు వినతిపత్రం సైతం సమర్పించారు. అధికారిక ఉత్తర్వులు రాకముందే వివరాలు వెలుగులోకి రావడం, బదిలీ సైతం ఆపాలని వినతి పత్రం ఇవ్వటం చర్చనీయాంశమైంది.