గుంటూరు టౌన్-2 సబ్ డివిజన్ పరిధిలో లైన్ల మరమ్మతులు జరుగుతున్నందున విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ గురవయ్య శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గుజ్జనగుండ్ల, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, ఎన్సీసీ అపార్ట్ మెంట్స్ తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరారు.